ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం మూసివేత

ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం మూసివేత

ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయాన్ని మూసివేస్తున్నట్టు అధికారులు శుక్రవారం ప్రకటించారు. కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తుండటంతో..కేంద్ర పురావస్తుశాఖ ఆధీనంలో ఉన్న దేవాలయాలన్నిటినీ మూసివేయాల్సిందిగా అధికారులు ఆదేశించారు. ఈ క్రమంలో ఒంటిమిట్ట ఆలయాన్ని మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రతీ ఏటా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు.