- సీఎం కేసీఆర్పై ఎంపీ అర్వింద్ మండిపాటు
- రైతులకు ఉచిత ఎరువులు ఎప్పుడిస్తరని ప్రశ్న
- ఓటర్లకు డబ్బు పంపిణీపై ఐటీ దాడులు జరిగే చాన్స్
హైదరాబాద్, వెలుగు: హుజూరాబాద్లో టీఆర్ఎస్ను ఓడించినందుకే రైతులపై సీఎం కేసీఆర్ కక్షగట్టారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల మీద ఓ వీధిరౌడీలాగా ఇష్టమొచ్చినట్టు కేసీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. నిజామాబాద్లో కవితను ఓడించినప్పుడు చెరుకు, పసుపు రైతులపై పగబట్టారని, ఇప్పుడు హుజూరాబాద్లోనూ అలాగే చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనబోమంటూ కేంద్రం లేఖ రాసిందని సీఎం చెప్తున్నారని.. ఆ లేఖను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడిన దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. కేంద్రం మెడలు వంచైనా తెలంగాణ సాధిస్తానని ఉద్యమంలో కేసీఆర్ అనలేదా అని ప్రశ్నించారు.
మతితప్పి మాట్లాడుతున్నరు
సంజయ్ను ఆరు ముక్కలు చేస్తానన్న కేసీఆర్ మాటలపై అర్వింద్ మండిపడ్డారు. కేటీఆర్పై జనం లో నమ్మకం పోవడంతోనే కేసీఆర్ మతితప్పి మాట్లాడుతున్నారన్నారు. రైతులకు శుభవార్త చెప్తానని ఏండ్లు గడిచిపోయాయని విమర్శించారు. ఫ్రీగా ఎరువులు ఇస్తామన్న హామీని ఎప్పుడు నిలబెట్టుకుంటారో చెప్పాలన్నారు. ఎనిమిదేండ్లలో ఒక్కసారైనా రైతులకు కేసీఆర్ పంట బోనస్ ఇచ్చారా? అని ప్రశ్నించారు. హుజూరాబాద్లో ఓటర్లకు డబ్బు పంచిన ఘటనలపై ఇన్కం ట్యాక్స్ దాడులు జరిగే చాన్స్ ఉందన్నారు. విచారణకు ముందే కేసీఆర్కు సీబీఐ అధికారులు వ్యాక్సిన్ వేస్తే మంచిదన్నారు. కేసీఆర్కు దుబాయ్ శేఖర్ అనే ముద్దు పేరు ఉందని గుర్తు చేశారు. నోటిఫికేషన్లు రాక నిరాశలో ఉన్న యువత రోడ్డెక్కబోతున్నారని అన్నారు. పద్మ అవార్డులంటే దొంగ పాస్పోర్టులు ఇచ్చినట్టు కాదని కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు. పద్మ అవార్డుల కోసం రాష్ట్రం నుంచి ఒక్కరి పేరు కూడా ఎందుకు సిఫార్సు చేయలేదో చెప్పాలన్నారు. కల్యాణలక్ష్మి తరహా పథకాన్ని శివరాజ్సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్లో 2007లోనే అమలు చేశారని అర్వింద్ గుర్తు చేశారు.