వర్షపు నీరు నిల్వ ఉండొద్దు : ఆశిష్ సంగ్వాన్

వర్షపు నీరు నిల్వ ఉండొద్దు : ఆశిష్ సంగ్వాన్
  • కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​

కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి పట్టణంలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్ సూచించారు. బుధవారం విద్యానగర్ కాలనీలో పారిశుధ్య పనులను పరిశీలించారు. వర్షాలకు నీళ్లు బ్లాక్​ అయ్యే ఏరియాల్లో డ్రైనేజీలను క్లీన్ చేయాలన్నారు.  తడి, పొడి చెత్తను ఎక్కడ పడితే  వేయొద్దన్నారు. భారీ వర్షాల కారణంగా అవసరమయితే తప్పా  ఇండ్ల నుంచి బటయకు రావొద్దని జిల్లా ప్రజలకు సూచించారు. మున్సిపల్​ కార్మికులకు పని ముట్లు, ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు వినియోగించే పరికరాలను కలెక్టర్​అందించారు. అడిషనల్ కలెక్టర్ చందర్​నాయక్,   మున్సిపల్ కమిషనర్ రాజేందర్​రెడ్డి ఉన్నారు.   

మాదవ ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

కామారెడ్డి : విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. బుధవారం నషాముక్త్ భారత్ అభియాన్​ను పురష్కరించుకొని కామారెడ్డి డిగ్రీ కాలేజీలో సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. ఎక్సైజ్​ శాఖ సూపరింటెండెంట్ హనుమంత్​రావు,  జిల్లా వెల్ఫేర్ అధికారి ప్రమీల,  ప్రిన్సిపాల్​   విజయ్​కుమార్ ఉన్నారు.  

డ్రగ్స్​ రహిత  సమాజమే లక్ష్యం.. 

 నషా ముక్త్​ భారత్ అభియాన్ లో భాగంగా కామారెడ్డి పోలీస్ స్టేషన్లో ఎస్పీ రాజేశ్​చంద్ర సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. ఏఎస్పీ చైతన్యారెడ్డి, టౌన్ సీఐ నరహరి, స్పెషల్ బ్రాంచ్ సీఐ శ్రీధర్ ఉన్నారు. ​ ​