గోదాంల నిర్వహణపై నిర్లక్ష్యం వద్దు : రాజీవ్​గాంధీ హనుమంతు

గోదాంల నిర్వహణపై నిర్లక్ష్యం వద్దు  : రాజీవ్​గాంధీ హనుమంతు

నిజామాబాద్, వెలుగు :  బియ్యం గోదాములను అన్ని శాఖలు పరిశీలించాలని కలెక్టర్ రాజీవ్​గాంధీ హనుమంతు తెలిపారు. గురువారం నగరంలోని మార్కెట్​ కమిటీ, స్టేట్ వేర్ హౌసింగ్​ కార్పొరేషన్​ గోదాములను కలెక్టర్​ పరిశీలించి మాట్లాడారు.  వర్షాలు కురుస్తున్నందున గోదాముల్లో లీకేజీలు లేకుండా చూడాలని,  వడ్లు, బియ్యం బస్తాలపై టార్ఫాలిన్లు కప్పాలన్నారు.  

కొనుగోలు కేంద్రాల్లోని వడ్ల బ్యాగులను మిల్లర్ల వద్దకు చేర్చాలని, లారీలు, లోడింగ్​, అన్​లోడింగ్, హమాలీల కొరత లేకుండా చూడాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కంట్రాక్టర్​పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్​ వెంట డీఎస్​వో అరవింద్​రెడ్డి, డీఎం శ్రీకాంత్​రెడ్డి, మార్కెట్ సెక్రటరీ అపర్ణ, గోదామ్ మేనేజర్ చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.