- కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి
నిజామాబాద్, వెలుగు : రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్ నిర్వహణకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి కోరారు. గురువారం సీఈసీ కమిషనర్ రాణి కుముదిణి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా ఆఫీసర్లతో కలెక్టర్మాట్లాడారు. నోటిఫికేషన్ రిలీజ్ మొదలుకొని మొత్తం ప్రక్రియ ముగిసేదాకా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని సొంత నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. సీపీ సాయిచైతన్య, అడిషనల్కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, డీపీవో శ్రీనివాస్రావు, డీఈవో అశోక్ నోడల్ ఆఫీసర్లు ఉన్నారు.
పంచాయతీ ఎలక్షన్కు పరిశీలకుల నియామకం
గ్రామ పంచాయతీ ఎలక్షన్ కోసం ప్రభుత్వం జిల్లాకు ఇద్దరు పరిశీలకులను నియమించిందని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి తెలిపారు. ఎన్నికల సాధారణ పరిశీలకుడిగా జి.వి.శ్యాంప్రసాద్లాల్, వ్యయ పరిశీలకుడిగా జె.కిషన్పమర్ను నియమించినట్లు తెలిపారు.
