విధుల్లో నిర్లక్ష్యం చేయొద్దు : వినయ్ కృష్ణారెడ్డి

విధుల్లో నిర్లక్ష్యం చేయొద్దు : వినయ్ కృష్ణారెడ్డి
  • కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

నిజామాబాద్, వెలుగు : విధుల్లో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని కలెక్టర్​ వినయ్​కృష్ణారెడ్డి అన్ని శాఖల అధికారులను హెచ్చరించారు. బుధవారం నిజామాబాద్ రూరల్​ మండలం తిర్మన్​పల్లి  గ్రామానికి వెళ్లగా ఏఈవో అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ గోవింద్​కు ఫోన్ చేసి రప్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ భారీ వర్షాలపై అలర్ట్​ చేసినా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. అనంతరం పాల్దా ప్రైమరీ స్కూల్ విజిట్​ చేశారు. 

30 మంది విద్యార్థులకు 25 మంది  ఫేసియల్​ అటెండెన్స్ ఉండడంపై హెచ్​ఎం సుమన్​రెడ్డిపై అసహనం వ్యక్తం చేశారు.  టెక్నికల్ ప్రాబ్లమ్స్​ ఉంటే వెంటనే సరి చేయాలని డీఈవో అశోక్​ను ఆదేశించారు. మధ్యాహ్న భోజనాన్ని చెక్​ చేశారు. స్కూల్​లోని ఇంకుడు గుంతను వాడకంలోకి తేవాలని సూచించారు. సింగిల్​ విండో గోదాంకు వెళ్లి యూరియా నిల్వలపై ఆరా తీశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, నర్సరీల నిర్వహణను పరిశీలించారు. తిర్మన్​పల్లి ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి డాక్టర్లకు సూచనలు చేశారు.