కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు...కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు...కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్  మేనిఫెస్టోను విడుదల చేసింది. మేనిఫెస్టోలో హామీల వర్షం కురిపించింది. తాము ప్రభుత్వంలోకి వస్తే.. ఉచిత విద్యుత్​, ఉచిత రవాణా, నిరుద్యోగ భృతి వంటివి ఇస్తామని ప్రకటించింది. 

కాంగ్రెస్  మేనిఫెస్టో

  •  నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు రెండేళ్లపాటు నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి
  •  నిరుద్యోగ డిప్లొమా హోల్డర్లకు నెలకు రూ.1500.
  •  200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, కుటుంబానికి చెందిన ప్రతి మహిళకు నెలకు రూ.2,000.
  • ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం
  • ఎస్సీలకు 15% నుంచి 17%,  ఎస్టీలకు 3% నుంచి 7%, మైనారిటీ రిజర్వేషన్లు 4% పునరుద్ధరణ
  • లింగాయత్‌లు, వొక కలిగ్గలు, ఇతర వర్గాల రిజర్వేషన్లను పెంపు... 9వ షెడ్యూల్‌లో చేర్చేందుకు ప్రయత్నం
  •  బజరంగ్ దళ్, PFI వంటి సంస్థలను నిషేధం విధించడంతోపాటు చట్ట ప్రకారం నిర్ణయాత్మక చర్యలు
  • మిల్క్ క్రాంతి పథకం కింద రోజుకు 1.5 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి జరిగేలా చేస్తాం
  •  రైతులకు పాల సబ్సిడీని రూ.5 నుంచి రూ.7కి పెంపు

కర్ణాటక ఎన్నికలు..

224 అసెంబ్లీ సీట్లున్న కర్ణాటకకు మే 10న ఎన్నికలు జరగనున్నాయి. 13న ఫలితాలు వెలువడనున్నాయి.