కల్వకుంట్ల ఫ్యామిలీ కంటే స్టువర్టుపురం దొంగలు నయం : నాయిని రాజేందర్ రెడ్డి

కల్వకుంట్ల ఫ్యామిలీ కంటే స్టువర్టుపురం దొంగలు నయం : నాయిని రాజేందర్ రెడ్డి
  • కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఫైర్

హైదరాబాద్, వెలుగు: కల్వకుంట్ల కుటుంబం కంటే స్టువర్టుపురం దొంగలు నయమని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం సీఎల్పీలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌‌‌‌‌‌‌‌తో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. అక్రమంగా సంపాదించిన అవినీతి డబ్బుతో కేటీఆర్ బలుపు మాటలు మాట్లాడుతు న్నాడని మండిపడ్డారు. సాఫ్ట్‌‌‌‌వేర్ సంస్కారం ఇదేనా.. నీ నాయన నేర్పిన సంస్కారం ఇదేనా అని ప్రశ్నించారు. కేటీఆర్‌‌‌‌‌‌‌‌ను తిట్టాలంటే తమకు సంస్కారం అడ్డువస్తోందన్నారు. అంత అవినీతి చేసిన కుటుంబం ఇంకా జైలుకు వెళ్లడం లేదనే బాధ తమకుందని, అయితే, సీఎం రేవంత్ మంచితనం వల్లే ఆ కుటుంబం ఇంకా బయటే ఉందన్నారు. 

ఏ రోజుకైనా కల్వకుంట్ల కుటుంబం జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందేనని హెచ్చరించారు. బల్మూరి వెంకట్‌‌‌‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌‌‌‌‌‌‌‌ తెలంగాణ జాతిపిత ఎలా అవుతారని ప్రశ్నించారు. జాతి పిత మహాత్మా గాంధీలో ఉన్న ఒక్క లక్షణమైనా కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు ఉందా అని నిలదీశారు. జైలుకెళ్తే సీఎం అవుతానని కేటీఆర్ ఆరాటపడుతున్నాడని ఎద్దేవా చేశారు. కేటీఆర్‌‌‌‌‌‌‌‌పై తాను కూడా ఇష్టమున్నట్లు విమర్శలు చేయొచ్చు కాని, సంస్కారం అడ్డు వస్తోందని చెప్పారు.