నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా..నలుగురు ప్రయాణికులు మృతి

నిజామాబాద్ జిల్లాలో  ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా..నలుగురు ప్రయాణికులు  మృతి

నిజామాబాద్ జిల్లాలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.అర్థరాత్రి 2 గంటలకు   ఇందల్వాయి,గన్నారం మధ్యలో అదుపు తప్పి ప్రైవేట్ ట్రావెల్  బస్సు  బోల్తా పడింది.  ఈ ప్రమాదంలో  నలుగురు మృతి చెందగా..తీవ్రగాయాలైన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. 

 హైదరాబాద్ నుంచి   22 మంది ప్రయాణికులతో  వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.  స్థానికులు క్షతగాత్రులను వెంటనే  నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండగా ప్రమాదం జరిగిందని చెప్పారు.. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.