నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్కు ఘన నివాళి

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్కు ఘన నివాళి

ఆర్మూర్/కామారెడ్డిటౌన్/బాల్కొండ/బోధన్​, వెలుగు : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు అంబేద్కర్ ఫొటోలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కామారెడ్డి కలెక్టరేట్​లో కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్, అడిషనల్ కలెక్టర్ మదన్​మోహన్​, బాల్కొండ మండలంలోని స్కూళ్లు, కాలేజీల్లో అంబేద్కర్​ఫొటోలకు నివాళులర్పించారు.  ఆర్మూర్​ టౌన్ లో కాంగ్రెస్ ఆర్మూర్​ నియోజకవర్గ ఇన్​చార్జి  ప్రొద్దుటూరి వినయ్​ కుమార్​ రెడ్డి అంబేద్కర్​ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  

బోధన్ మండలం కల్దుర్కిలో బీఎస్పీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాజ్యాంగ రచనలో అంబేద్కర్ కృషి చిరస్మరణీయమన్నారు. దళిత, బహుజనుల ఆరాధ్య దైవం అంబేద్కర్ అని, అయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అంటరానితనాన్ని రూపుమాపి అణగారిన వర్గాల్లో వెలుగులు నింపిన మహానుభావుడు అంబేద్కర్​అని కొనియాడారు.