సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు.. టైల్స్ వేయాలంటూ రూ.34 వేలు దోచుకున్నాడు

సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు.. టైల్స్ వేయాలంటూ రూ.34 వేలు దోచుకున్నాడు

జూబ్లీహిల్స్, వెలుగు: టైల్స్ వేయాలంటూ ఓ వ్యక్తికి ఫోన్ చేసిన సైబర్​నేరగాడు అతని అకౌంట్​నుంచి రూ.34 వేలు కాజేశాడు. తూముల రవికుమార్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ శ్రీకృష్ణనగర్ లో ఉంటున్నాడు. ఈ నెల 2న సాయంత్రం అతనికి ఓ ఫోన్​కాల్​వచ్చింది. అవతలి వ్యక్తి డాక్టర్ రాహుల్ గుప్తగా పరిచయం చేసుకున్నాడు. తనకు  టైల్స్ అవసరమని, ఎంత ఖర్చవుతుందని అడిగాడు. రూ.37,200 అవుతాయని రవికుమార్​చెప్పాడు. సైబర్ నేరగాడు అడ్వాన్స్​గా రూ.7,200 పంపిస్తున్నానని చెప్పాడు. కాసేపటికి  రవికుమార్ ఫోన్ కు రూ.72 వేలు  జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. పొరపాటున ఎక్కువ డబ్బులను పంపించానని చెప్పడంతో రవికుమార్​ రూ.34,800 తిరిగి పంపించాడు. తర్వాత బ్యాంక్ స్టేట్‌మెంట్‌ చూసుకొని, ఎవరి నుంచి ఎలాంటి డబ్బులు రాలేదని గుర్తించాడు.