
గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో 14 కేసులు ఛేదించి, దేశవ్యాప్తంగా 22 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. ట్రేడింగ్ మోసాలకు సంబంధించి 10 కేసుల్లో 17 మంది, పార్ట్టైమ్ జాబ్ ఫ్రాడ్లో ఇద్దరు, డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, జాబ్ ఫ్రాడ్ కేసుల్లో ఒకరి చొప్పున అరెస్ట్ చేసినట్లు పోలీసులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వీరి వద్ద నుంచి 15 సెల్ఫోన్లు, 17 సిమ్కార్డులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 48 కేసుల్లో కోర్టు ఆర్డర్తో రూ.69.19 లక్షలు (266 రిఫండ్లు) బాధితులకు చెల్లించినట్లు వివరించారు. మరో కేసులో రూ.1.16 కోట్ల ఆన్లైన్ ట్రేడింగ్ మోసానికి పాల్పడ్డ ఐదుగురిని మహారాష్ట్ర అరెస్ట్ చేశారు.