ఆర్చరీ క్వార్టర్‌ఫైనల్లో దీపికా కుమారి

ఆర్చరీ క్వార్టర్‌ఫైనల్లో దీపికా కుమారి

ఇండియన్‌ స్టార్‌ ఆర్చర్‌ దీపికా కుమారి ఒలింపిక్స్‌ క్వార్టర్‌ ఫైనల్ కు చేరుకుంది. ఇవాళ(బుధవారం) జరిగిన రౌండ్‌ ఆఫ్‌ 16 మ్యాచ్‌లో ఆమె అమెరికన్‌ ఆర్చర్‌ జెన్నీఫర్‌ ఫెర్నాండెజ్‌పై 6-4 తేడాతో గెలిచింది. ఐదు సెట్లలో హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో దీపికా 2, 3, 5 సెట్లలో విజయం సాధించింది. నాలుగు సెట్ల తర్వాత ఇద్దరు ఆర్చర్లు నాలుగేసి పాయింట్లతో సమంగా నిలవగా.. నిర్ణయాత్మక చివరి సెట్‌లో దీపికా 26 స్కోరుతో ఫెర్నాండెజ్‌ను వెనక్కి నెట్టి క్వార్టర్‌ ఫైనల్‌కి చేరింది.