ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ టౌన్లోని ప్రసిద్ధ నవనాథ సిద్దులగుట్టను సోమవారం భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. గుట్టపైన ఉన్న శివాలయం, రామాలయం, అయ్యప్ప మందిరం, దుర్గామాత, దత్తాత్రేయ, ఎల్లమ్మ తల్లి ఆలయాల్లో పురోహితులు జంగం కుమార్ శర్మ, నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో అభిషేకాలు, పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా రామాలయం నుంచి జీవ కోనేరు వరకు ఉత్సవ మూర్తులతో పల్లకీ సేవ జరిగింది. భక్తులు భజన కీర్తనలు చేస్తూ నృత్యాలు చేశారు. అనంతరం మందిర కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.
