గన్ మిస్ఫైర్.. డీఆర్జీ జవాన్ మృతి

గన్ మిస్ఫైర్.. డీఆర్జీ జవాన్ మృతి

భద్రాచలం, వెలుగు: ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని నారాయణ్​పూర్  జిల్లాలో ఆదివారం గన్​ మిస్ ఫైర్  అయి డీఆర్జీ జవాన్​ చనిపోయాడు. జిల్లాలోని కడేనార్​ క్యాంప్​లో పని చేస్తున్న డీఆర్జీ జవాన్​ బల్దేవ్​ సింగ్  హుర్రా శనివారం మావోయిస్టుల ఆపరేషన్​లో భాగంగా కూంబింగ్​కు వెళ్లారు. 

తిరిగి క్యాంప్​నకు వచ్చిన ఆయన ఆదివారం ఉదయం తన ఆయుధాన్ని శుభ్రం చేస్తుండగా మిస్​ ఫైర్​ అయి తలలోకి తూటా దూసుకెళ్లింది. అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ చనిపోయాడు. పోస్టుమార్టం అనంతరం డెడ్​బాడీని కుటుంబసభ్యులకు అప్పగించారు.