తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నల్లజర్ల మండలం అనంతపల్లి సమీపంలో లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలతో పాటు రెండేళ్ల చిన్నారి కూడా ఉంది.
బాధితులు విజయవాడ నుంచి రాజమండ్రికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. సహాయకచర్యలు చేపట్టారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.