
- సీఎం రేవంత్ రెడ్డికి ఈబీసీ జాతీయ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈబీసీ కమిషన్, కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని ఈబీసీ నేషనల్ ప్రెసిడెంట్ వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి కోరారు. శనివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని నివాసంలో సీఎంను కలిసి ఈబీసీ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
ఈబీసీల అభివృద్ధికి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి చేపడుతున్న సంక్షేమ పథకాలన్నీ అగ్రవర్ణాల్లోని నిరుపేదలకు వర్తింపజేయాలని పేర్కొన్నారు. ఈ అంశాలపై సీఎం సానుకూలంగా స్పందించారని, త్వరలో ఈబీసీ కార్పొరేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని రవీందర్ రెడ్డి తెలిపారు.