ఇటీవల జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు కాంస్య పతకాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. 16 ఏళ్ల తర్వాత ఈ ఈవెంట్లో మహిళల జట్టుకు ఇదే తొలి పతకం. ఈ జట్టు పెనాల్టీ షూటౌట్లో న్యూజిలాండ్ను ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఈ విజయతో పాటు.. ఇప్పుడు మరో విషయం కూడా అందర్నీ ఆకట్టుకుంటోంది. అదేంటంటే, కాంస్య పతకాన్ని గెలుచుకున్న తర్వాత భారత మహిళల జట్టు తమ విజయాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడం. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ వైరల్ వీడియోలో బృందం తమ డ్రెస్సింగ్ రూమ్లో 'సునో గౌర్ సే దునియా వాలోన్' పాటకు పరవశించిపోయి, ఉత్సాహంగా డ్యాన్స్ చేయడాన్ని గమనించవచ్చు. టీమ్ అంతా తమ ఆనందాన్ని దాచుకోలేక దేశభక్తి గీతానికి అనుగుణంగా గంతులేస్తూ.. ఆనందంతో నృత్యాలు చేస్తూ కనిపించారు. ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారి... దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.
All celeberations! So very proud of our ?? women ? team, overcoming all odds and turning the CLOCK ⏰ in their favour ?????? pic.twitter.com/efN7Oht6Ei
— Jagbir Singh OLY (@jagbirolympian) August 7, 2022