
హైదరాబాద్, వెలుగు: బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎడ్సెట్ సెకండ్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా కన్వీనర్ కోటాలో 10,005 సీట్లు అందుబాటులో ఉండగా, 12,076 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు.
దీంట్లో 7,441 మందికి సీట్లు కేటాయించినట్టు అడ్మిషన్ల కన్వీనర్ పాండురంగారెడ్డి తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 18లోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు. కాగా, ఫస్ట్ ఫేజ్లో 9,955 మందికి సీట్లు అలాట్ కాగా.. వారిలో 4,474 మంది మాత్రమే కాలేజీల్లో రిపోర్టు చేశారు.