వడ్లు కొనాలని రోడ్డెక్కిన రైతులు

వడ్లు కొనాలని రోడ్డెక్కిన రైతులు

మల్హర్, వెలుగు: వడ్లు త్వరగా కొనుగోలు చేసి, మిల్లులకు తరలించాలని డిమాండ్​చేస్తూ  మల్హర్ మండల కేంద్రం తాడిచెర్లలో రైతులు సోమవారం రోడ్డెక్కారు. టెంట్​వేసుకొని వంటావార్పుతో నిరసన తెలిపారు. నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లోనే ఉంటున్నామని, అధికారులు, ప్రజాప్రతినిధులు తీరుతో ధాన్యం సేకరణలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆరోపించారు. 

అకాల వర్షాలతో ధాన్యం మొలకెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ధర్నాతో తాడిచెర్ల జెన్​కో ఓపెన్ కాస్ట్ నుంచి భూపాలపల్లికి వెళ్లాల్సిన బొగ్గు లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కొయ్యూరు మెయిన్ రోడ్ పై  రైతులు ధర్నా చేపట్టారు. 3 వారాలైనా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో మొలకెత్తుతోందని వాపోయారు.

బూరుగుమల్ల గ్రామంలో..

పర్వతగిరి, వెలుగు: బూరుగుమల్ల గ్రామంలో ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు సోమవారం రోడ్డుపై ఆందోళన చేపట్టారు. నెల రోజులుగా కాంటా పెట్టకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.