జేఈఈ ర్యాంకర్​కు ఆర్థిక ఇబ్బందులు

జేఈఈ ర్యాంకర్​కు ఆర్థిక ఇబ్బందులు

ఏటూరు నాగారం, వెలుగు: ఆర్థిక ఇబ్బందులు ఆదివాసీ బిడ్డ ఉన్నత విద్యకు అడ్డంకిగా మారాయి. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం కంతనపల్లికి చెందిన దబ్బగట్ల నాగేశ్వర్ రావు, గంగాదేవిల చిన్న కూతురు  సమ్మక్క. ఏటూరునాగారంలోని ట్రైబల్​గర్ల్స్​రెసిడెన్షియల్​ స్కూల్​లో  5 నుంచి పదో  తరగతి, టీటీడబ్ల్యూఆర్​ జేసీలో ఇంటర్ పూర్తి చేసింది. ఇంటిదగ్గరే ఉంటూ జేఈఈ పరీక్షలకు ప్రిపేరై.. 4,165 ర్యాంక్ సాధించింది. చత్తీస్​గఢ్​స్టేట్​లోని రాయపూర్ నేషనల్​ ఇనిస్టిట్యూట్ ఆఫ్​టెక్నాలజీలో మైనింగ్​ఇంజనీరింగ్ సీటు వచ్చింది. అయితే నాగేశ్వరరావు ఇటీవల అనారోగ్యంతో చనిపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తాయి. స్కాలర్​షిప్​ట్యూషన్​ఫీజుకు సరిపోయినా.. మెస్ బిల్, స్టడీ మెటీరియల్ ఇతర అవసరాలను డబ్బులు లేకపోవడం ఆమె చదువుకు ఆటంకంగా మారింది. విషయం తెలిసి ఏటూరునాగారం మండలం ఆకులవారిఘనపూర్ లోని ట్రైబల్​గర్ల్స్​రెసిడెన్షియల్​స్కూల్ హెచ్ఎం రేవతి, వార్డెన్​ శ్రీలత, టీచర్లు ఉషారాణి, అరుణ, సాంబయ్య,  చెంచయ్య, ప్రభ, శ్యామలత, అర్చన చందాలు వేసుకుని తమ స్కూలు ఓల్డ్​ స్టూడెంట్​అయిన సమ్మక్కకు  రూ. 11వేల సాయం అందించారు. దాతలు ముందుకొచ్చి సమ్మక్కకు సాయం చేయాలని వారు కోరారు.