
చెన్నై: వీసా సమస్యల కారణంగా ఇండియాకు చెందిన ఐదుగురు యంగ్ ప్లేయర్లు ఫిడే వరల్డ్ జూనియర్ చెస్ చాంపియన్షిప్లో పాల్గొనే అవకాశం కోల్పోయారు. ఇందులో తెలంగాణకు చెందిన యువ గ్రాండ్మాస్టర్ ఉప్పాల ప్రణీత్ కూడా ఉన్నాడు. మెక్సికో సిటీలో ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది.
టోర్నీకి బయల్దేరే టైమ్కు కూడా ఐదుగురు ప్లేయర్లు, ఇద్దరు కోచ్లకు వీసాలు రాలేదు. దాంతో వీళ్లు లేకుండానే మిగతా టీమ్ మంగళవారం ఉదయం మెక్సికో సిటీకి బయల్దేరింది. వీసా అందని ప్లేయర్లలో ప్రణీత్తో పాటు వ్రశాంక్ చౌహాన్, అరుణ్ కటారియా, భాగ్యశ్రీ పాటిల్, ఫెమిల్ చెల్లాదురై కోచ్లు ప్రవింద్ తిప్సే, కిరణ్ అగర్వాల్ ఉన్నారు. ఇండియన్ గవర్నమెంట్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వీరికి వీసాలు ఏర్పాటు చేయలేకపోయామని ఫిడే అడ్వైజరీ బోర్డు చైర్మన్ భరత్ సింగ్ తెలిపారు.