యాదాద్రి బాలాలయంలోకి వరద నీళ్లు  

యాదాద్రి బాలాలయంలోకి వరద నీళ్లు  

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్టలో గురువారం తెల్లవారుజామున కుండపోత వర్షం కురిసింది. దీంతో బాలాలయంలోకి భారీగా వరద చేరింది. వరద నీటిలో కుర్చీలు వేసుకుని పూజారులు నిత్య పూజలు చేశారు. భారీ వర్షానికి దక్షిణం వైపు నుంచి వరద బాలాలయంలోకి చేరుకోవడంతో ఆలయం జలమయమైంది. యాదాద్రి డెవలప్‌‌మెంట్ లో భాగంగా కొండపై పునర్నిర్మిస్తున్న మెయిన్ టెంపుల్.. ప్రస్తుత బాలాలయానికి ఎగువన ఉండడంతో వరదంతా బాలాలయంలోకి చేరింది. బాలాలయానికి ఆనుకొని దక్షిణం వైపు రిటైనింగ్ వాల్ కట్టడంతో  వరద గుడిలోకి చేరి చెరువును తలపించింది. వరదతో పాటు బురద కూడా వచ్చింది. సిబ్బంది గంటపాటు శ్రమించి ఆలయాన్ని శుద్ధి చేశారు.