నటసింహంతో నాలుగో సారి..

నటసింహంతో నాలుగో సారి..

టాలీవుడ్​లో మరో క్రేజీ ప్రాజెక్ట్​తో అడుగుపెట్టబోతోంది నయనతార(Nayanthara). వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ తన క్యాల్షీట్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. కానీ, నందమూరి బాలకృష్ణతో సినిమా అంటే మాత్రం వెంటనే ఓకే చెప్పేస్తుందట. బాలయ్య బాబు(Balayya babu)  తన 109వ సినిమాను బాబీ(Bobby)  డైరెక్షన్​లో చేయనున్నాడు. 

ALSO READ: బీరు ఆమ్లేట్ ఏంట్రా.. ప్లీజ్ కొన్నాళ్లు బతకనీయండ్రా

లేటెస్ట్​ బజ్ ప్రకారం ఈ ప్రాజెక్ట్​లో నయనతారను హీరోయిన్​గా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన శ్రీరామరాజ్యం, సింహా, జైసింహా వంటి సినిమాలు బ్లాక్​బస్టర్స్​ గా నిలిచాయి. ఇప్పుడు నాలుగోసారి వీరిద్దరి జోడీ తెరపై కనిపించనుంది. ఇదే సినిమాలో మరో హీరోయిన్​ రోల్​ కోసం రకుల్ ప్రీత్​ సింగ్(Rakul Preet Singh)​, సంయుక్త మీనన్(Samyuktha Menon)​ పేర్లను పరిశీలిస్తున్నారట. సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానున్నట్టు తెలుస్తోంది.