ముంబై: కొత్త క్రెడిట్ కార్డులు ఇష్యూ చేయడానికి హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై థర్డ్ పార్టీ ఆడిట్ ముగియడంతోపాటు, లోపాల సవరణలకు ఆర్బీఐ సూచనలు అమలు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. గత రెండేళ్లలో చాలా సార్లు హెచ్ డీఎఫ్సీ ఆన్లైన్ సర్వీసులు పనిచేయకపోవడంతో కొత్త క్రెడిట్ కార్డుల జారీతోపాటు, కొత్త డిజిటల్ ప్రొడక్టులూ తేవొద్దని కిందటేడాది డిసెంబర్లో ఆర్బీఐ ఆంక్షలు విధించింది. దీంతో హెచ్డీఎఫ్సీ రిటెయిల్ బ్యాంకింగ్కు పెద్ద దెబ్బే తగిలింది. దేశంలోనే అత్యధికంగా 1.48 కోట్ల క్రెడిట్ కార్డులను హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఇష్యూ చేసింది. ఎస్బీఐ 1.2 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు 1.1 కోట్లు క్రెడిట్ కార్డులను ఇష్యూ చేశాయి. కొత్త డిజిటల్ బ్యాంకింగ్ ప్రొడక్టులపై బ్యాన్ మాత్రం మరి కొంత కాలం కొనసాగుతుందని ఆర్బీఐ తెలిపింది.
