మనిషి తన జీవిత కాలంలో తీసుకోవాల్సిన ఆహారం కంటే రెండు మూడు రెట్లు తీసుకుంటే అనారోగ్యం తప్పదు.. కాబట్టి మితాహారమే ఆరోగ్యమని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఆహార నియమాలు.. జీవన విధానాన్ని మార్చుకుంటే ఆయుష్షు పెరిగి ఎక్కువకాలం జీవిస్తారని చెబుతున్నారు.
అతిగా తినకూడనివి
- ప్యాకేజ్ ఫుడ్స్, నూడిల్స్ లాంటి వాటికి దూరంగా ఉండాలి.
- నూనె పదర్థాలైన పునుగులు, బజ్జీలు, సమోసాలు వంటి వాటిని ఎక్కువ తినకూడదు.
- చక్కెరతో తయారు చేసే స్వీట్లను
- కాకుండా బెల్లంతో తయారయ్యేవి తీసుకోవచ్చు.
ఇవి తినొచ్చు
- ఉదయాన్నే మూడు లేదా నాలుగు నానబెట్టిన బాదం పప్పులను తినడం
- ఒక అరగంట యోగా, ధ్యానం లేదా చిన్నపాటి నడక కచ్చితంగా చేయడం అలవాటు చేసుకోండి ఆహార పదార్థాల్లో ఉప్పును తగ్గించాలి.
- కాఫీ, టీలను వీలైనంత వరకూ మానేయాలి.
- రాగి జావ రోజూ తీసుకోవచ్చు.
- వీటన్నిటికంటే ప్రతి రోజూ కనీసం 7 గంటల సేపు నిద్రపోవాలి. ఇలా చేస్తే ఆరోగ్యం.. ఆనందం
