వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలో ఆ పార్టీలో చేరారు మాజీ టీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యమ్నాయం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీనే అని అన్నారు. తెలంగాణలో వైఎస్ఆర్ లెగసీ ఎక్కడికీ పోలేదని ఆయన అభిప్రాయపడ్డారు. వైఎస్ఆర్కు జిరాక్స్ కాపీలా షర్మిల కనిపిస్తోందని, షర్మిల చేస్తున్న పోరాటం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేయట్లేదని గట్టు రామచంద్రరావు అన్నారు. షర్మిల పార్టీలో మహిళలకు ప్రాధాన్యం పెరుగుతోందన్నారు. బండి సంజయ్ను ఎందుకు రాజకీయంగా హైలెట్ చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీతో దోస్తీ కోసమే కేసీఆర్ ఆరాటపడుతున్నారని, అందుకే తెలంగాణలో బీజేపీని హైలెట్ చేస్తున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో బీజేపీతో కలిసి కేసీఆర్ పని చేస్తారని గట్టు రామచంద్రరావు అన్నారు.
TRS సీనియర్ నేత,బీసీ నాయకుడు శ్రీ గట్టు రాంచందర్ రావు గారు YSR తెలంగాణ పార్టీలో చేరారు.లోటస్ పాండ్ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో YSRTP అధినేత్రి వైయస్ షర్మిల గారు రాంచందర్ రావు గారికి కండువా కప్పి,పార్టీలోకి ఆహ్వానించారు.#YSSharmila #YSRTelanganaParty #KCRFailedTelangana #YSR pic.twitter.com/xFbFPzm8PB
— YSR TELANGANA PARTY (@YSRTelangana) January 3, 2022