
హైదరాబాద్, వెలుగు: ప్రపంచ మోటార్ స్పోర్ట్స్లో ఇండియా, హైదరాబాద్కు చోటు ఖాయమైంది. ప్రతిష్టాత్మక ‘ఫార్ములా ఈ– రేస్’ చాంపియన్షిప్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 11వ తేదీన హైదరాబాద్లో జరుగుతుందని వరల్డ్ మోటార్ స్పోర్ట్ కౌన్సిల్ బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఎలక్ట్రిక్ కార్లతో జరిగే ఈ పోటీలకు ఆతిథ్యం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం జనవరిలో ‘ఫార్ములా ఈ’ అధికారులతో ఒప్పందం కుదుర్చుకుంది. ట్యాంక్బండ్ చుట్టూ రేస్ నిర్వహిస్తామని చెప్పింది. ఫార్ములా వన్ మాదిరిగా ‘ఈ–రేస్’కు ప్రత్యేక ట్రాక్ అక్కర్లేదు. సాధారణ రోడ్లపైనే రేసింగ్ నిర్వహిస్తారు. కాగా, 2011 నుంచి 2013 వరకు బుధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో ఫార్ములా వన్జరిగిన తర్వాత దేశంలో జరగబోయే రెండో అతి పెద్ద రేసింగ్ ఈవెంట్ ఇదే కానుంది. అలాగే ఇండియాలో జరిగే తొలి ఈ–రేస్గా రికార్డులకెక్కనుంది. దీనికి హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం తెలంగాణకు గర్వకారణం కానుంది.