
జీడిమెట్ల, వెలుగు: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం డివిజన్ సంజయ్గాంధీ నగర్లో గణేశ్మహరాజ్ అసోసియేషన్ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం దగ్గర ఆదివారం ఉచిత రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. దీన్ని మాజీ ఎమ్మెల్యే శ్రీశైలంగౌడ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా 50 మంది యువకులు రక్తదానం చేశారు. 10 మంది పేద విద్యార్థులకు చదువుల కోసం రూ.50 వేలు అందజేశారు. రాములు, రాఘవేంద్రగౌడ్, పెద్ద అరుణ్కుమార్, అనిల్కుమార్, హనుమంతరావు పాల్గొన్నారు.