రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు వంశీకృష్ణ పరామర్శ

రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు వంశీకృష్ణ పరామర్శ

ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్త దేవేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు కాంగ్రెస్ యువ నేత గడ్డం వంశీకృష్ణ. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం ఒత్కుల పల్లెలో దేవేందర్ రెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

ALSO READ :- మెస్ ఛార్జీలు రూ.50లు ఏం సరిపోతాయి: ఆర్ కృష్ణయ్య

దేవేందర్ రెడ్డి.. కాంగ్రెస్ గెలుపు కోసం ఎంతో కృషి చేశారన్నారు వంశీ కృష్ణ. మరోవైపు ఇటీవల పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలానికి చెందిన.. ఉమ్మడి ఏపీ గౌడ సంఘం జన హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బుర్ర కొండయ్య గౌడ్ మృతి చెందాడు. కొండయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు గడ్డం వంశీకృష్ణ.