
- ఆస్పత్రిలో నీటి సమస్యపై సూపరింటెండెంట్ సమావేశం
- ‘వెలుగు’ కథనానికి స్పందన
పద్మారావునగర్, వెలుగు: గాంధీ ఆస్పత్రిలోని పేషెంట్ల వార్డులు, వాష్రూమ్స్, ఆపరేషన్థియేటర్లకు జనరేటర్సాయంతో తాత్కాలికంగా నీరు సరఫరా చేస్తున్నారు. హే గాంధీ.. ఏందీ యాతన? శీర్షికన ఆదివారం వెలుగు దినపత్రికలో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించి, చర్యలు తీసుకున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్రాజకుమారి అసిస్టెంట్ డైరెక్టర్, ఆర్ఎంవోలు, అధికారులతో నీటి సరఫరా నిలిచిపోయిన అంశంపై అత్యవసర సమావేశం నిర్వహించారు.
సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ‘వెలుగు’తో మాట్లాడుతూ.. గాంధీ ఆస్పత్రి పంప్హౌస్లోని పవర్ కేబుల్డ్యామేజ్ అవడంతో నీటి సరఫరా కు అంతరాయం కలిగిందన్నారు. ప్రస్తుతం పంప్హౌజ్వద్ద ఏర్పాటు చేసిన జనరేటర్ సాయంతో వార్డులకు నీరందిస్తున్నామని, అదనంగా మరో జనరేటర్ కూడా పెట్టబోతున్నామని తెలిపారు. అండర్ గ్రౌండ్ నుంచి వెళ్లే పవర్కేబుల్ను మార్చాల్సి ఉందని, సివిల్ వర్క్స్కూడా చేయాల్సి ఉన్నందున కొద్ది రోజుల్లో సమస్య పూర్తిగా పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. పేషంట్లతోపాటు వారి సహాయకులకు, వైద్య విభాగాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.