రామగుండం రీజియన్ ఓసీపీ - 3లో వెహికల్ బ్రేక్ లు ఫెయిలై.. జనరల్ మజ్దూర్ కు గాయాలు

రామగుండం రీజియన్ ఓసీపీ - 3లో వెహికల్ బ్రేక్ లు ఫెయిలై.. జనరల్ మజ్దూర్ కు గాయాలు
  • రామగుండం రీజియన్ ఓసీపీ - 3లో ప్రమాదం 

గోదావరిఖని, వెలుగు : సింగరేణిలోని రామ గుండం రీజియన్ ​ఓపెన్​ కాస్ట్​–3 ప్రాజెక్ట్​లో జరిగిన ప్రమాదంలో జనరల్​మజ్దూర్​గాయపడ్డాడు. ఆదివారం మధ్యాహ్నం ప్రాజెక్ట్​ ఫేజ్–2లోని వివిధ మెషీన్లలో డిజిల్​పోసేందుకు బోయర్​వెహికల్ తో డ్రైవర్ పి.కార్తిక్​, జనరల్​మజ్దూర్​కార్మికుడు శ్రావణ్​బయలుదేరారు. మార్గమధ్యలో  బ్రేక్​లు ఫెయిల్​కావడంతో  వెహికల్  ఆపేందుకు   డ్రైవర్ ​ప్రయత్నించాడు. ఆగకపోవడంతో శ్రావణ్​కిందకు దూకి టైర్ల కింద సపోర్ట్​పెట్టాడు. 

అది దిగబడిపోవడంతో వెహికల్​ముందుకు కదిలింది.  శ్రావణ్ ప్రాణాలను కాపాడుకునేందుకు వెహికల్ మధ్యలోకి వెళ్లాడు. వెహికల్​సైలెన్సర్​ తక్కువ ఎత్తులో ఉండడడంతో అతడిని తాకుతూ వెళ్లడంతో  గాయపడ్డాడు. వెంటనే అతడిని గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా ఆస్పత్రికి, మెరుగైన ట్రీట్​మెంట్​ కోసం హైదరాబాద్​లోని ఆస్పత్రికి రెఫర్​చేశారు. గాయపడిన శ్రావణ్​ను ఐఎన్టీయూసీ, టీబీజీకేఎస్​లీడర్లు శంకర్​నాయక్​, అయిలి శ్రీనివాస్​తదితరులు పరామర్శించారు. కాలం చెల్లిన వెహికల్స్​ను మేనేజ్​మెంట్​నడపించడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, ఘటనపై విచారణ జరిపించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ​చేశారు.