
- పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్పై లీగల్ ఒపీనియన్ తీసుకోనున్న జిష్ణుదేవ్
హైదరాబాద్, వెలుగు: పంచాయతీరాజ్చట్టం–2018 సవరణ ఆర్డినెన్స్ విషయంలో గవర్నర్ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొన్నది. ఈ నెల 15వ తేదీనే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలోని 285(ఏ) నిబంధనను సవరించింది. ఇందులో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపిరికల్ డేటా ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయని మార్చి ఆర్డినెన్స్ఫైల్ను గవర్నర్కు పంపింది. అయితే దీనిపై గవర్నర్ లీగల్ ఒపీనియన్తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్ట్సవరణకు సంబంధించి కూడా సీఎస్, పంచాయతీరాజ్ ఉన్నతాధికారుల నుంచి క్లారిటీ తీసుకోనున్నట్లు తెలిసింది. గురువారం గవర్నర్ సిద్దిపేట జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. ఈ సందర్బంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు పంచాయతీరాజ్ చట్ట సవరణపై వివరించాలని భావిస్తున్నారు.
గవర్నర్ నిర్ణయానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై ముందుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. అయితే ఈ ఆర్డినెన్స్కు సంబంధించి రాజ్భవన్నుంచి పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చునని సెక్రటేరియెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. కుల గణన సర్వే, ఎంపిరికల్ డేటా ప్రకారం బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఇచ్చే జీవోపై ఎవరైనా కోర్టుకు వెళ్తే ఏం జరుగుతుందనే దానిపైనే కొంత టెన్షన్నెలకొందని చెబుతున్నారు.