వర్ధన్నపేట, వెలుగు: ఉప్పరపల్లి క్రాస్ వద్ద ఐదెకరాల ప్రభుత్వ భూమిలో రూ.28 కోట్లతో నిర్మించనున్న 100 పడకల ఆస్పత్రికి ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు కలెక్టర్ సత్యశారద, టెస్కాబ్చైర్మన్ మార్నేని రవీందర్ రావు తో కలిసి మంగళవారం భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ప్రభుత్వంలో శిలాఫలకాలు వేశారే తప్ప అభివృద్ధి పనులు చేపట్టలేదని విమర్శించారు. ఈ ఆస్పత్రి పూర్తయితే వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు మండలాల ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యరంగాలపై ఫోకస్ పెట్టిందని తెలిపారు.
వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలి
వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలని కలెక్టర్సత్యశారద ఆదేశించారు. మంగళవారం వర్ధన్నపేట మండలం ఇల్లందలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. కొనుగోలు చేసిన వడ్లను వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. కార్యక్రమాల్లో అడిషనల్కలెక్టర్ సంధ్యారాణి, డీఎంహెచ్వో సాంబశివరావు, డీసీహెచ్రామ్మూర్తి, ఇల్లంద వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటయ్య, ఐనవోలు ఆలయ కమిటీ చైర్మన్ ప్రభాకర్ గౌడ్, డీసీఎస్ వో కిష్టయ్య పాల్గొన్నారు.
