ఆన్లైన్‌ బెట్టింగ్‌కు యువకుడు బలి

 ఆన్లైన్‌ బెట్టింగ్‌కు యువకుడు బలి

ధర్మసాగర్, వెలుగు: ఆన్​లైన్​ బెట్టింగ్ తో ఓ యువకుడు సూసైడ్​ చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి.. హనుమకొండ జిల్లా ధర్మసాగర్  మండలం ఉనికిచెర్ల గ్రామానికి చెందిన చీమల రాకేశ్(22) డిగ్రీ ఫైనల్  ఇయర్  చదువుతున్నాడు. కొంత కాలం నుంచి ఆన్​లైన్ లో రమ్మీ ఆడేవాడు. దీని కోసం పలు మొబైల్  యాప్స్ లలో లోన్లు తీసుకొని డబ్బంతా పోగొట్టుకున్నాడు. 

అప్పును తిరిగి చెల్లించే అవకాశం లేకపోవడంతో గురువారం రాత్రి ఇంటిలో ఉన్న గడ్డి మందు తాగాడు. ఆ తరువాత తల్లికి చెప్పడంతో ఎంజీఎం ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం చనిపోయాడు. మృతుడి తల్లి చీమల రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్​పెక్టర్  శ్రీధర్​రావు తెలిపారు.