
హైదరాబాద్ సిటీ, వెలుగు: బల్దియా మేయర్ గద్వాల విజయలక్ష్మికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. శుక్రవారం అర్ధరాత్రి ఆమెకు ఓ ఆగంతకుడు ఫోన్ కాల్స్ ద్వారా వేధింపులకు పాల్పడ్డాడు. మేయర్తో పాటు ఆమె తండ్రి, సీనియర్ రాజకీయ నాయకుడు కే కేశవరావును కూడా చంపేస్తానని బెదిరించినట్లు సమాచారం. తనను బోరబండలో చనిపోయిన సర్దార్కు సంబంధించిన వ్యక్తిగా చెప్పుకుంటూ, అసభ్యకరమైన పదజాలంతో కాల్స్, వాయిస్ మెసేజ్లు చేశారు.
దీంతో గుర్తు తెలియని వ్యక్తిపై మేయర్ను వేధిస్తున్నాడని ఆమె పీఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తూ, ఆగంతకుడిని గుర్తించేందుకు ఫోన్ కాల్ వివరాలు, ఇతర సాంకేతిక సాక్ష్యాలను సేకరిస్తున్నారు.