ఆసియా క్రీడల్లో ఫేవరెట్గా టీమిండియా.. ఇవాళ (సెప్టెంబర్ 18) జపాన్తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్

ఆసియా క్రీడల్లో ఫేవరెట్గా టీమిండియా.. ఇవాళ (సెప్టెంబర్ 18) జపాన్తో  క్వార్టర్ ఫైనల్ మ్యాచ్

ఉ. 10.30 నుంచి సోనీ లివ్‌‌‌‌‌‌‌‌లో లైవ్‌‌‌‌‌‌‌‌


నగోయా: ఆసియా కప్‌‌‌‌‌‌‌‌ గెలిచి జోరుమీదున్న ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌ జట్టు... ఆసియా క్రీడల టైటిల్‌‌‌‌‌‌‌‌ కోసం సన్నద్ధమైంది. ఇందులో భాగంగా శుక్రవారం జరిగే క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్లో ఇండియా.. ఆతిథ్య జపాన్‌‌‌‌‌‌‌‌తో తలపడనుంది. డిఫెండింగ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగుతున్న హర్మన్‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌ సేన... జపాన్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే అన్ని రంగాల్లో చాలా బలంగా ఉంది. కాబట్టి ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఇండియా ఓవరాల్‌‌‌‌‌‌‌‌ ఫేవరెట్‌‌‌‌‌‌‌‌గా కనిపిస్తోంది.

ఆసియా కప్‌‌‌‌‌‌‌‌లో అద్భుతంగా ఆడిన ఓపెనర్‌‌‌‌‌‌‌‌ షెఫాలీ వర్మపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ టోర్నీలో అత్యధిక రన్స్‌‌‌‌‌‌‌‌తో టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌ను సొంతం చేసుకుంది. స్టార్‌‌‌‌‌‌‌‌ ఓపెనర్‌‌‌‌‌‌‌‌ స్మృతి మంధాన గత టోర్నీలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. కాబట్టి ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో బ్యాట్‌‌‌‌‌‌‌‌ ఝుళిపించాలని పట్టుదలగా ఉంది. వీళ్లతో పాటు కెప్టెన్‌‌‌‌‌‌‌‌ హర్మన్‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌, రిచా ఘోష్‌‌‌‌‌‌‌‌ కూడా చెలరేగితే భారీ స్కోరు ఖాయం.

బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ దీప్తి శర్మ అత్యంత కీలకం కానుంది. లెఫ్టార్మ్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ శ్రీచరణి, శ్రేయంకా పాటిల్‌‌‌‌‌‌‌‌, రాధా యాదవ్‌‌‌‌‌‌‌‌ స్పిన్‌‌‌‌‌‌‌‌ బాధ్యతలు మోయనున్నారు. శ్రీచరణి 30 మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో 50 వికెట్ల మైలురాయిని అందుకుంది. పేస్‌‌‌‌‌‌‌‌ విభాగంలో రేణుకా ఠాకూర్‌‌‌‌‌‌‌‌, క్రాంతి గౌడ్‌‌‌‌‌‌‌‌ చెలరేగితే జపాన్‌‌‌‌‌‌‌‌కు ఇబ్బందులు తప్పవు. మరోవైపు ఇండియాను  నిలువరించాలంటే జపాన్‌‌‌‌‌‌‌‌ శక్తికి మించి కష్టపడాలి.