రోహిత్‌‌‌‌ రికార్డు బ్రేక్‌‌‌‌.. 30 బాల్స్లోనే సెంచరీ చేసిన తొలి ఇండియన్‌‌ అభిషేక్..

రోహిత్‌‌‌‌ రికార్డు బ్రేక్‌‌‌‌.. 30 బాల్స్లోనే సెంచరీ చేసిన తొలి ఇండియన్‌‌ అభిషేక్..
  • మూడో టీ20లోనూ 127 రన్స్‌‌ తేడాతో ఇండియా విజయం.. 

 న్యూఢిల్లీ: బ్యాటింగ్‌‌‌‌లో అభిషేక్‌‌‌‌ శర్మ (34 బాల్స్‌‌‌‌లో 9 ఫోర్లు, 11 సిక్స్‌‌‌‌లతో 108) రికార్డు సెంచరీతో దుమ్మురేపిన వేళ.. బౌలర్లు కూడా సమయోచితంగా రాణించడంతో.. మూడో టీ20లోనూ ఇండియా 127 రన్స్‌‌‌‌ తేడాతో అఫ్గానిస్తాన్‌‌‌‌పై అద్భుత విజయం సాధించింది. దాంతో మూడు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌ను టీమిండియా 3–0తో క్లీన్‌‌‌‌స్వీప్‌‌‌‌ చేసింది. టాస్‌‌‌‌ ఓడిన ఇండియా 20 ఓవర్లలో 221/7 స్కోరు చేసింది. సంజూ శాంసన్‌‌‌‌ (35 బాల్స్‌‌‌‌లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 50) హాఫ్‌‌‌‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఛేజింగ్‌‌‌‌లో అఫ్గానిస్తాన్‌‌‌‌ 14.1 ఓవర్లలో 94 రన్స్‌‌‌‌కే కుప్పకూలింది. కెప్టెన్‌‌‌‌ ఇబ్రహీం జద్రాన్‌‌‌‌ (25) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. అభిషేక్​కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’, ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద సిరీస్‌‌‌‌’ అవార్డులు లభించాయి. 

దంచుడే.. దంచుడు

ముందుగా బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ఇండియాకు ఓపెనర్లు అభిషేక్‌‌‌‌, శాంసన్‌‌‌‌ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. తొలి ఓవర్‌‌‌‌లో ఫోర్‌‌‌‌తో టచ్‌‌‌‌లోకి వచ్చిన అభిషేక్‌‌‌‌.. రెండో ఓవర్‌‌‌‌లో 6, 4, 6తో బాదుడు షురూ చేశాడు. మూడో ఓవర్‌‌‌‌లోనూ 6, 6, 4, 4తో 23 రన్స్‌‌‌‌ దంచాడు. తర్వాతి ఓవర్‌‌‌‌లో శాంసన్‌‌‌‌ 6తో టచ్‌‌‌‌లోకి రాగా, అభిషేక్‌‌‌‌ బౌండ్రీ బాదాడు. మహ్మద్‌‌‌‌ నబీ వేసిన ఐదో ఓవర్‌‌‌‌లో శాంసన్‌‌‌‌ 6, 6 కొట్టి క్యాచ్‌‌‌‌ ఔట్‌‌‌‌ నుంచి తప్పించుకున్నాడు. ఆ వెంటనే అభిషేక్‌‌‌‌ 6, 4, 6తో 12 బాల్స్‌‌‌‌లోనే హాఫ్‌‌‌‌ సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఓవర్‌‌‌‌లో మొత్తం 29 రన్స్‌‌‌‌ వచ్చాయి. ఆరో ఓవర్‌‌‌‌లో అభిషేక్‌‌‌‌ 4, 4, 6తో పవర్‌‌‌‌ప్లేలో స్కోరు 100/0కు చేరింది. ఫీల్డింగ్‌‌‌‌ను విస్తరించిన తర్వాత కూడా అభిషేక్‌‌‌‌ దూకుడు మాత్రం తగ్గలేదు. 

ఏడో ఓవర్‌‌‌‌లో ఇద్దరూ చెరో ఫోర్‌‌‌‌తో జోరు కంటిన్యూ చేశారు. ముజీబ్‌‌‌‌ వేసిన ఎనిమిదో ఓవర్‌‌‌‌లో అభిషేక్‌‌‌‌ రెండు సిక్స్‌‌‌‌లు, తర్వాతి ఓవర్‌‌‌‌లో మరో సిక్స్‌‌‌‌, సింగిల్స్‌‌‌‌తో 30 బాల్స్‌‌‌‌లోనే సెంచరీ పూర్తి చేశాడు. పదో ఓవర్‌‌‌‌లో మరో సిక్స్‌‌‌‌ కొట్టిన అభిషేక్‌‌‌‌ను చివరి బాల్‌‌‌‌కు రషీద్‌‌‌‌ ఖాన్‌‌‌‌ (1/43) పెవిలియన్‌‌‌‌కు పంపాడు. టర్నింగ్‌‌‌‌ బాల్‌‌‌‌ అభిషేక్‌‌‌‌ బ్యాట్‌‌‌‌ ఎడ్జ్‌‌‌‌ను తాకి గుర్బాజ్‌‌‌‌ చేతుల్లోకి వెళ్లింది. దాంతో తొలి పది ఓవర్లలో ఇండియా స్కోరు 142/1కు చేరింది. శాంసన్‌‌‌‌కు తోడైన తిలక్‌‌‌‌ వర్మ (2) అనూహ్యంగా 12వ ఓవర్‌‌‌‌లో రనౌటయ్యాడు. 

కెప్టెన్‌‌‌‌ శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ (29) కూడా వేగంగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగెత్తింది. 13వ ఓవర్‌‌‌‌లో ఫోర్‌‌‌‌తో 34 బాల్స్‌‌‌‌లో హాఫ్‌‌‌‌ సెంచరీ పూర్తి చేసిన శాంసన్‌‌‌‌ తర్వాతి ఓవర్‌‌‌‌లో వెనుదిరిగాడు. 15వ ఓవర్‌‌‌‌లో శివమ్‌‌‌‌ దూబే (14) 6, 4, శ్రేయస్‌‌‌‌ 6తో 17 రన్స్‌‌‌‌ వచ్చాయి. స్కోరు 184/3కి పెరిగింది.  ఇక్కడి నుంచి ఇండియా వరుస విరామాల్లో వికెట్లు చేజార్చుకుంది. ఓ ఎండ్‌‌‌‌లో శ్రేయస్‌‌‌‌ నిలకడగా ఆడినా.. 16వ ఓవర్‌‌‌‌లో దూబే, 18వ ఓవర్‌‌‌‌లో ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌ (10), నితీశ్‌‌‌‌ రెడ్డి (1) ఔటయ్యారు. మధ్యలో రెండు సిక్స్‌‌‌‌లు కొట్టిన శ్రేయస్‌‌‌‌ చివరి ఓవర్‌‌‌‌లో రనౌటయ్యాడు. 

బౌలర్లు సూపర్‌‌‌‌..

భారీ ఛేదనలో అఫ్గానిస్తాన్‌‌‌‌ను ఇండియా బౌలర్లు స్టార్టింగ్‌‌‌‌ నుంచే కట్టడి చేశారు. పేసర్‌‌‌‌ నితీశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ (3/25), స్పిన్నర్‌‌‌‌ రవి బిష్ణోయ్‌‌‌‌ (3/26) మధ్యలో అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌ (2/9) సూపర్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌తో వరుస విరామాల్లో వికెట్లు తీశారు. జద్రాన్‌‌‌‌తో తొలి వికెట్‌‌‌‌కు 31 రన్స్‌‌‌‌ జోడించిన రెహమానుల్లా గుర్బాజ్‌‌‌‌ (15)తో పాటు సెడిఖుల్లా అటల్‌‌‌‌ (1)ను ఒకే ఓవర్‌‌‌‌లో ఔట్‌‌‌‌ చేసి అక్షర్‌‌‌‌ అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. ఆ వెంటనే బుమ్రా (1/16).. డార్విష్‌‌‌‌ రసోలి (0)ని డకౌట్‌‌‌‌ చేశాడు. ఐదో ఓవర్‌‌‌‌లో జద్రాన్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేసి యశ్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌ (1/17) తొలి వికెట్‌‌‌‌ ఖాతాలో వేసుకున్నాడు. ఒమర్‌‌‌‌జాయ్‌‌‌‌ (17), నూర్‌‌‌‌ ఉల్‌‌‌‌ రెహమాన్‌‌‌‌ (11) ఆదుకునే ప్రయత్నం చేసినా సక్సెస్‌‌‌‌ కాలేదు. మహ్మద్‌‌‌‌ నబీ (8), రషీద్‌‌‌‌ ఖాన్‌‌‌‌ (6), ముజీబ్‌‌‌‌ (0), అబ్దుల్లా అహ్మద్‌‌‌‌జాయ్‌‌‌‌ (6), ఫజల్‌‌‌‌హక్‌‌‌‌ ఫారూఖీ (0 నాటౌట్‌‌‌‌) సింగిల్‌‌‌‌ డిజిట్‌‌‌‌కే పరిమితం కావడంతో అఫ్గాన్‌‌‌‌ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. 

సంక్షిప్త స్కోర్లు

ఇండియా: 20 ఓవర్లలో 221/7 (అభిషేక్‌‌‌‌ 108, శాంసన్‌‌‌‌ 50, ఒమర్‌‌‌‌జాయ్‌‌‌‌ 2/27), 

అఫ్గానిస్తాన్‌‌‌‌: 14.1 ఓవర్లలో 94 ఆలౌట్‌‌‌‌ (జద్రాన్‌‌‌‌ 25, నితీశ్‌‌‌‌ 3/25, రవి బిష్ణోయ్‌‌‌‌ 3/26). 


రోహిత్‌‌‌‌ రికార్డు బ్రేక్‌‌‌‌

ఈ మ్యాచ్‌‌‌‌లో 30 బాల్స్‌‌‌‌లోనే సెంచరీ చేసిన అభిషేక్‌‌‌‌ మాజీ కెప్టెన్‌‌‌‌ రోహిత్‌‌‌‌ శర్మ పేరుమీదున్న రికార్డును బద్దలు కొట్టాడు. డిసెంబర్‌‌‌‌ 2017లో శ్రీలంకపై 35 బాల్స్‌‌‌‌లో రోహిత్‌‌‌‌ చేసిన సెంచరీ రికార్డును బ్రేక్‌‌‌‌ చేసి ఇండియా తరఫున టాప్‌‌‌‌లో నిలిచాడు. టీ20ల్లో అభిషే క్‌‌‌‌కు ఇది మూడో సెంచరీ కావడం విశేషం. 317.64 స్ట్రయిక్‌‌‌‌ రేట్‌‌‌‌తో బ్యాటింగ్‌‌‌‌ చేసిన అభిషేక్‌‌‌‌.. టెస్ట్‌‌‌‌ హోదా కలిగిన దేశంపై వేగంగా సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌‌‌‌గా రికార్డు లకెక్కాడు. అలాగే అత్యంత వేగంగా చేసిన టీ20 సెంచరీల జాబితాలో అభిషేక్‌‌‌‌ మూడో ప్లేస్‌‌‌‌లో నిలిచాడు. జూన్‌‌‌‌ 2024లో సైప్రస్‌‌‌‌పై ఈస్టోనియా బ్యాటర్‌‌‌‌ సాహిల్‌‌‌‌ చౌహాన్‌‌‌‌ 27 బాల్స్‌‌‌‌లో, జులై 2025లో బల్గేరియాపై టర్కీ బ్యాటర్‌‌‌‌ మహమ్మద్‌‌‌‌ ఫహద్‌‌‌‌ 29 బాల్స్‌‌‌‌లో చేసిన సెంచరీలు ముందున్నాయి.