రైల్వే ట్రాక్లపై ఏఐ ఆధారిత కెమెరాలు

రైల్వే ట్రాక్లపై ఏఐ ఆధారిత కెమెరాలు
  • ప్రమాదాల నుంచి జంతువులను రక్షించేందుకు రైల్వే నిర్ణయం    

హైదరాబాద్​సిటీ, వెలుగు: రైల్వే ట్రాక్ లపై ఏఐ ఆధారిత కెమెరాలను బిగించాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. అటవీ జంతువులను రక్షించడానికి ఇండియన్ రైల్వేస్ ఈ నిర్ణయం తీసుకుంది. ఏఐ కెమెరాలను ట్రాక్​లపై అమరిస్తే లోకో పైలట్​లకు ముందుగానే సమాచారం అందుతుంది. ట్రాక్ పై జంతువు ఉంటే ఆ రూట్ లో వస్తున్న లోక్ పైలట్ కు 0.5కిలోమీటర్ల దూరంలోనే ఉండగానే తెలిసిపోతుంది. వీటి ఏర్పాటుతో ప్రమాదాల నుంచి జంతువులను రక్షించవచ్చు. భారతీయ రైల్వే ఇటీవల ఆర్టిఫిషీయల్​ఇంటెలిజెన్స్​ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్ (ఐడీఎస్​)ను అభివృద్ధి చేసింది.  

రైల్వేట్రాక్​లపై ఎనుగులను పసిగట్టడానికి దీనిని వినియోగిస్తున్నది. ఐడీఎస్​విధానాన్ని ప్రయోగాత్మకంగా నార్త్​ఈస్ట్​ఫ్రాంటియర్​ రైల్వే సెక్షన్​లో141 కి.మీ. పరిధిలో అమలు చేయగా విజయవంతమైంది. దీంతో భారతీయ రైల్వే తమ పరిధిలోని మరో 981 కి.మీ. మేర ఏఐ ఆధారిత కెమెరాలను అమర్చనున్నట్టు అధికారులు తెలిపారు. దీంతో దేశ వ్యాప్తంగా 1,122 కి.మీ. పరిధిలో ఈ విధానం అమలులో వస్తుందని చెప్పారు.