
హైదరాబాద్ శిల్పకళా వేదికలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ యాంటీ డ్రగ్ , ఇల్లీగల్ ట్రాఫికింగ్ డే అవగాహన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినీ నటులు రామ్ చరణ్, విజయ దేవరకొండ , నిర్మాత దిల్ రాజ్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, చేవెళ్ల బీజేపీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పలు రకాల స్టాళ్లను పరిశీలించారు.
మాదక ద్రవ్య రహిత సురక్షితమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. యువతను ఆరోగ్యకరమైన ఉజ్వల భవిష్యత్తు వైపు నడిపించడమే లక్ష్యంగా కలిసి పని చేద్దామని “అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినం” సందర్భంగా కోరారు. డ్రగ్ ఫ్రీ తెలంగాణ సంకల్పానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్.