రాష్ట్రవ్యాప్తంగా జూన్ 21న స్కూళ్లలో ఇంటర్నేషనల్ యోగా డే

రాష్ట్రవ్యాప్తంగా జూన్ 21న స్కూళ్లలో ఇంటర్నేషనల్ యోగా డే

హైదరాబాద్,వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా అన్ని బడుల్లో ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. కేం ద్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు శనివారం ఉదయం 6:30 నుండి 7:45 వరకు జరిగే యోగా సంగమ్ అనే కార్యక్రమంలో పాల్గొనా లని సూచించారు.  ఈ మేరకు డీఈఓలకు ఆయన మంగళవారం ఆదేశాలు జారీచేశారు. అన్ని బడుల్లో ఈ ఏడాది "యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్" అనే థీమ్ తో కార్యక్రమాన్ని 

చేపట్టాలని కోరారు. శరీరం, మనస్సు, పర్యావరణం మధ్య సామరస్యాన్ని సాధించడంలో యోగా కీలక పాత్ర పోశిస్తోందన్నారు.  ఆయుష్ మంత్రిత్వ శాఖకు సంబంధించిన వెబ్ సైట్​ https://yoga.ayush.gov.in/yoga-sangam  లోని కామన్ యోగా కార్యక్రమాలను పరిశీలించాలని సూచించారు. ఇది 22 భాషాల్లో ఉందని వెల్లడించారు.