టెహ్రాన్: ఇరాన్లో మహిళలపై అత్యాచారం కేసుల్లో దోషులుగా తేలిన ముగ్గురికి మంగళవారం ఉరిశిక్ష విధించారు. కాస్మోటిక్ సర్జరీ క్లినిక్గా నమ్మించి మహిళలను మోసం చేసేవారని, క్లినిక్కు వచ్చిన మహిళలకు మత్తు ఇంజెక్షన్ఇచ్చి లైంగిక దాడులకు పాల్పడినట్లు స్థానిక మీడియా తెలిపింది. 2021లో వారు 12 లైంగిక దాడుల కేసుల్లో దోషులుగా తేలినట్లు న్యాయశాఖకు చెందిన మిజాన్ ఆన్లైన్ వెబ్ సైట్ నివేదించింది. అనధికారిక బ్యూటీ సెలూన్లో చాలామంది మహిళలను రేప్చేసిన ముగ్గురు వ్యక్తులకు ఉరిశిక్ష అమలుచేసినట్లు హర్మోజ్గాన్ చీఫ్జస్టిస్మోజ్తాబా తెలిపినట్లు వెబ్సైట్ నివేదించింది.
కాగా, ముగ్గురిలో ఒకరైన మెడికల్అసిస్టెంట్అబద్ధపు ప్రకటనలతో ఏడుగురు మహిళలను మోసగించాడని, ఫేక్ క్లినిక్కు వచ్చిన బాధిత మహిళలకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అనంతరం వారిని రేప్ చేసేవాడని నివేదికలో పేర్కొన్నారు. మిగిలిన ఇద్దరు నర్సులు..వీరు ఐదు రేప్ కేసులతోపాటు డ్రగ్స్ దొంగతనం ఆరోపణల్లోనూ దోషులుగా నిర్ధారణ అవడంతో ఉరిశిక్ష అమలు చేసినట్లు నివేదించారు. కాగా, ఇరాన్గతేడాది పలు కేసుల్లో 582మందికి ఉరిశిక్ష అమలు చేసినట్లు అమ్నెస్టీ ఇంటర్నేషనల్హ్యూమన్ రైట్స్ గ్రూప్తెలిపింది.