
చందానగర్, వెలుగు: భర్తతో గొడవల కారణంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ఆత్మహత్య చేసుకున్న ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మహారాష్ర్ట కొల్లాపూర్కు చెందిన అరుణ శివాజీ పాటిల్(30)కు అదే ప్రాంతానికి చెందిన నిలేశ్తో 2023 మార్చిలో వివాహమైంది. ఉద్యోగ నిమిత్తం 2025 జనవరిలో భార్యాభర్తలు హైదరాబాద్కు వచ్చి నల్లగండ్లలోని అపర్ణ గేటెడ్ కమ్యూనిటీలో నివాసముంటున్నారు. అరుణ హైటెక్సిటీలో ఓ ఐటీ కంపెనీలో జాబ్ చేస్తుంది. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం కూడా ఇద్దరు గొడవ పడ్డారు. భర్త ఇంట్లో నుంచి వెళ్లిపోగా అరుణ బెడ్రూంలో చున్నీతో ఫ్యాన్కు ఉరేసుకుంది. చందానగర్ పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
పురుగుల మందు తాగి మరొకరు..
చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం అమీనాబాద్ గ్రామానికి చెందిన జి.సుమన్(35) లేబర్ పనిచేస్తుంటాడు. ఆయనకు ఐదేళ్ల క్రితం వివాహం జరగ్గా పిల్లలు పుట్టకపోవడంతో అదే గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళతో కలిసి నగరానికి వచ్చి తెల్లాపూర్లోని ఇంద్రానగర్లో ఉంటున్నాడు. సోమవారం అర్ధరాత్రి చందానగర్ పోస్టాఫీస్ మెట్ల వద్ద సుమన్ పురుగుల మందు తాగి చనిపోయాడు. డెడ్బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
హిమాయత్సాగర్లో దూకి యువకుడు..
గండిపేట: హిమాయత్సాగర్లో దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం హియాయత్ సాగర్లో యువకుడి డెడ్బాడీ బయటకు తెలడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రాజేంద్రనగర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకోని మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడిని ముఖేష్ గా గుర్తించారు. డెడ్బాడీని పోస్టుమార్టంకు తరలించి, ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.