బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఇళ్లు, ఆఫీస్ లలో ఐటీ ఆఫీసర్ల సోదాలు ఇవాళ్ల కూడా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, ఫైళ్ల శేఖర్రెడ్డితో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ఆఫీస్లు, ఇళ్లలో కంటిన్యూగా తనిఖీ చేస్తున్నారు. జూన్ 14 ఉదయం 6 గంటల నుంచి ఐటీ అధికారులు ఆయా ప్రజాప్రతినిధుల ఇళ్లలోనే ఉన్నారు. హైదరాబాద్, బెంగళూరుతో పాటు రాష్ట్రంలోని 60 ప్రాంతాల్లో 400 మంది అధికారుల ఆధ్వర్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి.
ఇప్పటికే కీలకమైన ఫైల్స్, హార్డ్డిస్క్లు, బ్యాంక్ లాకర్స్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ రాత్రి వరకు సోదాలు కొనసాగే అవకాశం ఉంది. ఐటీ అధికారుల తీరుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు నిరసనలు తెలుపుతున్నారు. బీజేపీ కక్ష సాధింపు ధోరణికి పాల్పడుతోందని విమర్శించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.