
టాలీవుడ్ నటుడు అల్లరి నరేష్ హీరోగా ఏఆర్ మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. జీ స్టూడియోస్తో కలిసి హాస్య మూవీస్పై రాజేష్ దండా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్కి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. అల్లరి నరేష్ ఇందులో మారేడుమిల్లిలో ఎన్నికల విధులకు నిర్వర్తించే ప్రభుత్వ అధికారి పాత్రలో కనిపించాడు.
తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్లో నరేష్, అతని సహచరులు, పోలీసు అధికారులతో కలిసి గిరిజన ప్రాంతంలో నడుస్తున్నట్లు కనిపిస్తోంది.
ఆనంది కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ చిత్రానికి బాలాజీ గుత్తా సహనిర్మాత కాగా, రాంరెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్, చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేశారు.
తారాగణం: అల్లరి నరేష్, ఆనంది, వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్
సాంకేతిక సిబ్బంది:
రచన & దర్శకత్వం: AR మోహన్
నిర్మాత: రాజేష్ దండా
నిర్మాత: జీ స్టూడియోస్ మరియు హాస్య మూవీస్
సహ నిర్మాత: బాలాజీ గుత్తా
సంగీత దర్శకుడు: శ్రీచరణ్ పాకాల
డైలాగ్స్: అబ్బూరి రవి
DOP: రాంరెడ్డి
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
స్టంట్స్: పృథ్వీ
కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్, బిన్నీ
DI - అన్నపూర్ణ స్టూడియోస్
PRO: వంశీ-శేఖర్