- జనగామ అడిషనల్ కలెక్టర్ పింకేశ్కుమార్
బచ్చన్నపేట, వెలుగు : విద్యార్థుల ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యం నివ్వాలని జనగామ అడిషనల్ కలెక్టర్, జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్ పింకేశ్ కుమార్ టీచర్లకు సూచించారు. గురువారం బచ్చన్నపేట మండలంలోని పలు ప్రభుత్వ స్కూళ్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ స్కూల్ను సందర్శించి నూతనంగా నిర్మిస్తున్న తరగతి గదులను పరిశీలించారు. వంటగదిని పరిశీలించి కూరగాయాలు, ఆహార పదార్థాలు శుభ్రంగా ఉంచాలన్నారు.
విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని చెప్పారు. బచ్చన్నపేట ప్రైమరీ స్కూల్ను సందర్శించారు. స్కూల్ గదుల్లో నిర్వహిస్తున్న అంగన్వాడీ, ప్రైమరీ హెల్త్ సెంటర్ను వెంటనే ఖాళీ చేయించి వేరే ప్రదేశానికి మార్చాలని ఎంపీడీవో మమతాబాయిని ఆదేశించారు. పోచన్నపేట స్కూల్లో స్టూడెంట్స్ కోసం పైలెట్ ప్రాజెక్టుగా వేసిన వాల్ పెయింటింగ్ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల హాజరుశాతం పెంచాలని టీచర్లకు సూచించారు. ఆయన వెంట ఏఎంవో శ్రీనివాస్, జీసీడీవో గౌషియా బేగం, ఎంఈవో వెంకట్రెడ్డి, ఇంజినీరిగ్ డిపార్ట్మెంట్ డీఈ రవిందర్,టీచర్లు ఉన్నారు.
