జనగామ అర్బన్, వెలుగు: పత్తి విక్రయించడానికి వచ్చే రైతులను జిన్నింగ్ మిల్లుల యాజమాన్యం, సీసీఐ అధికారులు ఇబ్బందులకు గురి చేయొద్దని జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. పత్తి కొనుగోలు పైన వ్యవసాయ, మార్కెటింగ్, జిన్నింగ్ మిల్లుల యాజమాన్యంతో కలెక్టరేట్లో మంగళవారం రివ్యూ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని నాణ్యత పేరిట తిరస్కరించకుండా కొనుగోలు చేయాలని ఆదేశించారు.
వ్యవసాయ అధికారులు రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. అంతకుముందు పోలీస్, రెవెన్యూ, మార్కెటింగ్, సివిల్ సప్లై శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు క్షేత్రస్థాయిలో అలర్ట్గా ఉండాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించాలని చెప్పారు. స్థానికంగా నిర్వహించిన యువజన ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. కళా రంగాల అవకాశాలను యువత వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
