
ముషీరాబాద్, వెలుగు: ఇంటర్ ఫలితాల్లో కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ అత్యధికంగా మార్కులు సాధించారని మేనేజ్మెంట్ తెలిపింది. మరింత కష్టపడి చదివి రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించాలని సూచించింది. బైపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న దీక్షిత లహరి 440 మార్కులకు గాను 435 మార్కులు సాధించినందుకు సోమవారం మేనేజ్మెంట్ ఘనంగా సత్కరించి అభినందించింది.
ఈ సందర్భంగా ఇన్స్టిట్యూషనల్ డైరెక్టర్ రిషికాంత్ మాట్లాడారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ మంచి ఫలితాలు సాధించారన్నారు. ఇంత మంచి మార్క్స్ రావడానికి కాలేజ్ యాజమాన్యం, ఫ్యాకల్టీ కృషి ఎంతగానో ఉందన్నారు. స్టూడెంట్ దీక్షిత లహరి మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాలేజీలో చదవడం అదృష్టంగా భావిస్తున్నానని, మేనేజ్మెంట్ తనతో పాటు అందరినీ వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నదని తెలిపారు.
కాలేజీలో అన్ని సౌలత్లు ఉండడంతో పాటు ఫ్యాకల్టీ ఇచ్చిన స్టడీ మెటీరియల్, కరస్పాండెంట్ సరోజా వివేక్ దిశా నిర్దేశంతో కష్టపడి చదివినందుకు ఈ ఫలితం వచ్చిందని చెప్పారు. ఫ్యాకల్టీ చాలా టిప్స్ చెప్పారని, వచ్చే ఏడాది కోసం మంచి ప్రిపరేషన్ ఇప్పటి నుంచి ప్రారంభిస్తున్నానని, ఇంత సక్సెస్ వెనకాల మేనేజ్మెంట్ కృషి ఎంతో ఉందని తెలిపింది.