రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఫొటోగ్రఫీ డే

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో  ఫొటోగ్రఫీ డే

 కామారెడ్డిటౌన్, వెలుగు :  ఫొటోలు జ్ఞాపకాలకు జీవంగా ఉంటాయని అడిషనల్ కలెక్టర్ చందర్​నాయక్​అన్నారు. మంగళవారం కామారెడ్డి రోటరీ క్లబ్​ఆధ్వర్యంలో వరల్డ్​ఫొటోగ్రఫీ డే నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అడిషనల్ కలెక్టర్ హాజరై మాట్లాడారు. 

ఫొటోగ్రఫీ జీవితాన్ని చిత్రీకరించే ఒక ఆయుధమన్నారు. ఫొటో చరిత్రలో జ్ఞాపకంగా నిలుస్తుందని చెప్పారు. అనంతరం ఫొటోగ్రాఫర్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అసిస్టెంట్​గవర్నర్​ జైపాల్​రెడ్డి, ప్రెసిడెంట్ శంకర్, సెక్రటరీ కృష్ణహరి, ప్రతినిధులు పాల్గొన్నారు.