
కామారెడ్డి టౌన్, వెలుగు : దారి దోపిడీకి పాల్పడిన భార్యాభర్తలను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా కేంద్రాంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ రాజేశ్చంద్ర నిందితుల వివరాలు వెల్లడించారు. బసన్నపల్లికి చెందిన పెద్దల రాజు కామారెడ్డిలోని ఓ హోటల్లో పని చేస్తున్నాడు. ఈనెల 17న రాత్రి అతడు పని ముగించుకొని బైక్పై బసన్నపల్లికి వెళ్తున్నాడు. చర్చి గ్రౌండ్ సమీపంలోకి రాగానే ఓ మహిళ అతడి బైక్ను ఆపి లిఫ్ట్అడిగింది. సరంపల్లి వద్ద దింపాలని కోరింది. ఇది నమ్మి రాజు తన బైక్పై ఎక్కించుకొని వెళ్తుండగా ఈఎస్ఆర్ గార్డెన్ సమీపంలోకి రాగానే మరో వ్యక్తి బైక్పై వచ్చి రాజును ఆపాడు.
ఇద్దరు కలిసి రాజును కొట్టి అతడి వద్ద ఉన్న రూ.2 వేల నగదు, సెల్ఫోన్ లాక్కొని పారిపోయారు. వెంటనే బాధితుడు కామారెడ్డి టౌన్పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డిలో నివాసం ఉంటున్న బైండ్ల భాగ్య, ఆమె భర్త రవికుమార్ ను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడంతోదోపిడికి పాల్పడినట్లు ఒప్పుకున్నారు. వీరిద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి రూ.600 నగదు, బైక్స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఏఎస్పీ చైతన్యారెడ్డి, టౌన్ సీఐ నరహరి తదితరులు పాల్గొన్నారు.